Wednesday 19 November 2014

మాతృ దేవో భవ

 ఏ ప్రాణి కైనా మొదటి గురువు తల్లి కదా!  మది లో బాధ పడకుండా ఎన్నో రకముల ఊడిగములు చేసి పెంచుతుంది. తరువాత గురువు,   తండ్రి.   ఈ దేహము, విజ్ఞానము,  ఇచ్చి ఇహ పరములకు దారి చూపించేది తండ్రి.   తరువాత  గురువు (ఆచార్యుడు),   తల్లి, తండ్రి తో పాటు మనము ఏ విధముగా ఈ సమాజములో జీవించాలో బోధనా పధ్ధతి లో మనకు అంద  జేస్తాడు.   అందుకే ఈ మగ్గురికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులు గా ఉండాలి అని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.   గురువు గారు  అంటే మనలో గూడు కట్టు కొన్న అజ్ఞానము ను రూపు మాపి  వెలుగు ను చూపించే వారు.  అంతటి ముఖ్యమైన గురువు ను అన్వేషించుట  ఎలా!  మన అన్వేషణ లో,  మనము ఎవరి దగ్గరకు వెళ్లిన తరువాత మన మనసు ప్రశాంతత  పొందుతుందో, వారే  మన గురువు గా  ఎంచుకోవాలి.  లోకము లో ఎంతో మంది గురువులు ఉన్నారు. అంతమంది లో స్వానుభవము ఉన్న గురువు  దొరుకుతే మనకు చాల మంచిది.  ఆయన గురువు కాదు సద్గురువు అని పిలవబడతాడు.  ఇప్పుడు గురువుల లో చాలా  మంది నాలుగు పుస్తకములు చూసి  బాగా చదివి నేను గురువు ని అనుకొంటూ తమ వెంట శిష్యులను తిప్పుకొంటూ  ఉండటము మనము చూస్తూనే ఉన్నాము.  వారు చదువుకొన్న విషయము బాగా ఆకళింపు  చేసుకొని దాని లో అనుభవము సంపాదించి ఆచరణ లో పెట్టి  అప్పుడు అ అనుభవములు శిష్యులకు చెప్తే వారి సాధన లో ఎంతో ఉపకరిస్తూ  ఉంటాయి .    మన  పూర్వ జన్మ సుకృతుము లచే మనకు  మంచి సద్గురువు లభిస్తాడు.  అలా  గురువు లభించిన తరువాత   త్రికరణ శుద్ధి గా  అంటే మనో వాక్కాయ కర్మల చే ఇంకో సంశయము అన్నది లేకుండా ఆయన ను నమ్మితే, ఆయన మనలను జాగ్రత్త గా ముందుకు నడిపిస్తాడు.  ఇది శిష్యులు గా మన పని  అనుకొందాము.  ఇంక గురువు ల దగ్గరకు వస్తే వాళ్ళు కూడా మనము ఎలా అయన కోసము అన్వేషించామో,  అదే విధముగా సరి అయిన శిష్యుడు కోసము ఆయనా  వెతుకుతూనే ఉంటాడు.  గురు శిష్యుల  వెతుకులాట  అనాది నుంచీ  జరుగుతున్నదే.   గురువు తనకు తాను ఒక గురువునీ,  అని అనుకొంటే అతని సాధన అక్కడ తో ఆగిపోతుంది.  తనకు తాను ఎల్లప్పుడూ నేను విద్యార్ధినే,  అని అనుకొంటేనే తన సాధన జరుగుతూ ఉంటుంది.   తన సాధన చేస్తూ తను ముందుకు నడుస్తూ తన శిష్యుని కి మార్గము చూపిస్తూ ఉండాలి.  తాను ఒక మార్గదర్శిని అని మాత్రమే అనుకొంటూ ఉండటము చాల ముఖ్యము.  అయితే ఇక్కడ శిష్యుడు తను మాత్రము గురువు ను గురువు గానే  ఎంతో శ్రద్ధ తో అయన చెప్పినట్లు నడుచుకోవాలి.  అప్పుడు తనకు వచ్చే సూచనలు వల్ల  తన సాధన సజావుగా సాగుతూ ఉంటుంది.  ఒక వేళ  గురువు చెప్పిన విషయములో ఏదైనా తప్పు ఉంటే ఆ  దోషము గురువుకే  గాని శిష్యుడు గా  నమ్మి చేయుట వలన తనకు ఏ దోషము ఉండదు. 

No comments:

Post a Comment