Friday 28 November 2014

గురువు - పూర్ణ విశ్వాసము..........

శ్రీ సుబ్బరామయ్య గారు శ్రీ వెంకయ్య స్వామిని  శరీరము తో ఉన్నప్పుడు  కూడా సేవ చేసుకొన్న వారు అని తెలియచేశాను   కదా.  అప్పటి నుంచి  స్వామి సమాధి అయిన తరువాత కూడా తెల్లవారు ఝామున 4 గంటల కే  లేచి కాల కృత్యములు త్వరగా ముగించు కొని స్వామిసన్నిధి కి చేరు కొని,  సేవ చేసుకొని 9 - 10 గంటల మధ్య లో వచ్చి అప్పుడు విశ్రాంతి తీసుకొనే వారని, అలా విశ్రాంతి తీసుకొనే సమయము లో ఎంతటి వారు వచ్చినా అయన విశ్రాంతి కి భంగము కలిగించి లేపను అని వారి శ్రీమతి ద్వారా తెలుసుకొన్నాను.  అదేమీ చిత్రమో, సాధన లో నా రెండో రోజు 10 - 10-30 మధ్య లో ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి సుబ్బరామయ్య గారు అని పేరుతొ పిలిచి, ఆయన శ్రీమతి ని  సుబ్బరామయ్య గారిని లేప మని అడిగారు. మాములుగా ఆయన శ్రీమతి  వారు విశ్రాంతి తీసుకొంటున్నారు, ఇప్పుడు లేపను,  కొంత సేపు ఆగండి అని బదులు ఇచ్చారు.  ఫరవా లేదు అమ్మా, మేము భరద్వాజ మాష్టారి శిష్యులమే, మా పేరు చెప్పి లేపితే అయన లేస్తాడు అని ఆ వచ్చిన వాళ్ళు తొందర చేస్తుంటే, తప్పేది లేక శ్రీ సుబ్బరామయ్య గారిని లేపారు.  ఆయన వస్తూనే వారిద్దరిని పేర్లతో పలకరిస్తూ, ప్రక్క గది లో ఉన్న నన్ను కూడా పిలిచి నా గురుంచి చెప్పి,  నేను తరువాత అరుణాచలము వెళ్ళాల్సిన విషయము చెప్పి, వీలయితే ఎలా వెళ్ళాలో చెప్పమని చెప్పి, వచ్చి కూర్చోమన్నారు.  వారి సత్సంగ  గోష్టి లో పాలుపంచుకొనే అవకాశము దొరికినందుకు చాలా  సంతోషించాను.  కాసేపు సత్సంగము అయిన తరువాత, మీరు ఇలా వెళ్తే బాగుంటుంది అని నాకు దారి తెలియ చేశారు.  వారికి  కృతజ్ఞతలు చెప్పాను.   ఇంక రెండో రోజు అక్కడే ఉన్న అవధూత రామి రెడ్డి తాత గారిని కూడా దర్శించుకొన్నాము.  మూడో రోజు కూడా నా సాధన ముగించుకొని శ్రీ సుబ్బరామయ్య గారికి మా కృతజ్ఞతలు తెలుపుకొని ముందుకు నా రెండో మజిలి అయిన అరుణాచలము,   కాట్పడి మీదుగా ప్రయాణించి చేరుకొన్నాము.  ఎక్కడా నిలిచే సమయము లేక మేము ఏమి తీసుకొనకుండానే ప్రయాణము చేశాము.  అరుణాచలము లో దిగి ఆశ్రమము చేరు కొనేటప్పటికి సాయంత్రము 6 గంటలు దాటింది.  అక్కడికి వెళ్ళిన తరువాత ఆశ్రమ నిర్వాహకుల దగ్గరకు వెళ్లి మళ్లీ నా విషయము అంతా చెప్పి 3 రోజుల పాటు సాధన చేసుకొనేందుకు గది  ఇప్పించ వలసినది గా అడిగాను.

No comments:

Post a Comment