Monday 10 November 2014

శోధన

ఆ  ప్రశ్న  ఏమిటి  అంటే   ఒక గురువు  చెప్పిన విషయమును  ఇంకొక గురువు  ఎందుకు  అలా  కాదు అని  ఎందుకు అంటారు.   ఎందరో  గురువులు  అన్నిరకాల  మార్గాలు.   ఒక  సాధకుడు  ఎవరిని నమ్మాలో తెలియక  తికమక పడుతూ  ఉంటాడు.    అసలు ఈ గురువులను  అందరినీ  ఒక  మార్గములో పెట్టగలిగిన వారు  లేరా?  అని ఒక  తపన నాలో ఉదయించింది.   పరమపద సోపానములు  అధిరోహించాలి అంటే  ఎవరిని  పట్టుకొంటే,  మన మార్గము సుగమము  అవుతుంది.  తెలుసుకోవలిసిన   విషయము ఒకటే,   ఏ గురువు చెప్పినా  ఒకేలా  చెప్పాలి కదా! కానీ  ఇక్కడ జరుగుచున్నది,    ఏమిటి అంటే  ఒక్కొక్క  గురువు  చెప్పాలిసిన విషయము  ఒకటే అయినప్పటికీ  వారి వారి గ్రాహ్య శక్తి  ని బట్టి  వారికీ అర్ధమైన  విషయము,   దానికి  కొంత వారి వారి అనుభవములు  బట్టి,   చెప్పే విషయము మారి పోతోంది.   మేమే అధికులము  అంటూ  ఎవరికి వారు ఇన్ని మార్గాలు చూపిస్తున్నారు.  నా మార్గాన్వేషణ లో అయ్యప్ప స్వామి మాల రెండు సార్లు   వేసుకొన్నాను.   మొదటి సారి  జ్యోతికి  (50 రోజులు దగ్గఱ గా),  రెండో సారి  మండలమునకు వెళ్ళాను.      నా జపము, పారాయణ  చేస్తూ  ఎవరు  సరి అయిన గురువు  అని  ఆర్తి  తో ఎదురు  చూస్తుండగా  ఒక రోజు  జపము చేసుకొనే సమయములో  నా లో  నుంచి  నీవు  దత్తాత్రేయుని పట్టుకో అని  సూచన  వచ్చింది.  ఇది నా సాధన విషయములో జరిగిన సత్యం.   నా  పూర్వ జన్మ సుకృతమో,  నా  పెద్దల  అశీస్సులో  దత్తాత్రేయుడు   నన్ను  ఆశీర్వదించాడు.  ఆయననే  గురువు  గా  తలుచుకొని నా  సాధన  చేయడము ప్రారంబించాను. అక్కడితో  నా  సాధన  సరి అయిన మలుపు  తిరిగింది.

No comments:

Post a Comment