Sunday 28 December 2014

పిఠాపురము తొలి రోజులు

సాధన లో భాగము గా కాకినాడ నుంచి పిఠాపురము బదిలీ చేయించి శ్రీ గురు దత్తుడు నన్ను తన దగ్గరికి తీసుకొన్న విధానము మీకు అందరికి తెలియ చేశాను కదా!  శ్రీ గురు దత్తుని కృపా కటాక్ష వీక్షణములకు పాత్రుడనయినందుకు ఒక సారి మళ్లీ మనసారా నమస్కరించు కొని గురువు గారు  ఇక మీద ఎలా నన్ను సాధన లో ముందుకు నడిపించారో సాధకులయిన మీతో పంచుకోటానికి సిద్ధమవుతున్నాను.  అప్పటి దాకా గాయత్రీ జపము,  శ్రీ గురు చరిత్ర పారాయణము చేసిన నేను,  దత్తాత్రేయుని పూజా కార్యక్రమము (షోడశోపచారములతో) మొదలు పెట్టాలనిపించి, శ్రీ దత్తునే మనసులో తలుచుకొని ఎలా పూజా క్రమము అనిపించిందో అలాగే ఒక ప్రతి తయారుచేసుకొని మానసిక యోగ సాధన తో పాటు స్థూల పూజ చేయటము మొదలుపెట్టాను.   ఏ కాలమయినా, ఎటువంటి పరిస్తితులయినా,  తెల్లవారు ఝామునే లేచి పూజా కార్యక్రమము పూర్తి చేసుకొని ఉదయము 6.00, 6.30 గం. లకు పిఠాపురము లో పాద గయా క్షేత్రము నందు శ్రీ దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహమును దర్శించుకొని అక్కడే సాధన చేస్తుండే వాడిని. నెమ్మదిగా పిఠాపురము లో సాధకుల తో పరిచయము అవటము మొదలయింది.  ఊరి మధ్య లో శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానము కార్య వర్గము బ్యాంకు లావాదేవీలకు మా దగ్గరకి వచ్చేవారు కాబట్టి వారి తో కూడా  పరిచయము కలిగింది.  ఎప్పుడు ఎంతటి  మహానుభావులు (దత్త భక్తులు) పొరుగు రాష్ట్రాల నుంచి, శ్రీ దత్తాత్రేయుని తొలి అవతారమయిన శ్రీపాద శ్రీ వల్లభుని జన్మస్థలమయిన పిఠాపురము వచ్చినా  స్వామి ని పాద గయా క్షేత్రములో దర్శించుకొని, శ్రీపాద శ్రీ వల్లభుని సంస్థానము లో బస చేసి పూజా, పారాయణ, సత్సంగ కార్యక్రమము లు జరుపుకొంటున్నా నేను వెళ్లి పాలుపంచుకొనడము ఒక అలవాటుగా మారింది.  ఆ విధము గా చక్కటి సాధన జరుగుతూ ఉండేది. ఒక రోజు ఉదయము గుడికి వెళ్తున్న సమయము లో నాకు స్థానికులు  ఒకరు ఎదురుగా వస్తున్నారు.

No comments:

Post a Comment