Thursday 23 October 2014

నాందీ ప్రస్థావన

 ఈ  రోజు దీపావళి. అనుకోకుండా  మా చిన్న బావ గారు వచ్చారు. యధాలాపంగా కబుర్లలో బ్లాగుల గురించి ప్రస్తావన వచ్చింది.  మీరు ఏమైనా బ్లాగు   ప్రారంభించారా అని  అడిగారు. నేను దత్తోపాసకుడను కాబట్టి స్వామి పేరున బ్లాగు చాలా రోజులకిందే ప్రారంభించాను అని చెప్పాను. మీరు మొదలు పెట్టి ఎందుకు కొనసాగించ లేదు, మీకు తెలిసిన విషయాలు అందులో పెడితే నచ్చిన వారు చదువుతారు. ఈ రోజు మళ్లిమొదలుపెట్ట వచ్చు కదా అని అన్నారు. నేనైతే ఏదో మొదలు పెట్టాను గాని నా వల్ల  కాదేమో అని అన్నాను.  అదేమిటి నేను నేర్పుతాను మొదలు పెట్టండి అని అన్నారు.  ఈ రోజు అమావాస్య కదా, అమావాస్య సాధారణముగా ఏ పనైన  మొదలుపెట్టడమంటే అలొచిస్తూ ఉంటాము.కాని ఏ పనైనా అనుకొన్న వెంటనే మొదలుపెట్టాలి. మరొక విషయం మనకు తెలిసిందే, దత్త సంప్రదాయంలో గడిచిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చునే కన్నా వర్తమానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.  రేపటి పని ఇవాళ చేయి, ఈరొజు పని ఇప్పడే చేయి. ప్రతి క్షణము వాడుకోవాలి కాలమన్నది ఎవరికోసము ఆగదు దాని పని అది చేసుకొంటూ పరుగు లు తీస్తూ ఉంటుంది.అందుకని  ఆ బ్లాగునే ఈ రోజు నుంచి వాడుకొందాము అని అనుకున్నాం.

No comments:

Post a Comment