Thursday 30 October 2014

మానవుని పరిణామము

ముందు తెలుసుకున్న విధముగా   మానవుడు  తన  నిజ స్థితిని  మరిచి  ఈ  దేహమే  నేను  అనుకొంటూ  తన  మనసుకు  తోచిన విధముగా  పశు  ప్రవృత్తితో  ప్రవర్తిస్తు   ఉంటాడు.   మానవునికి  జంతువు కన్నా మంచి  చెడు  ఆలోచించి చేసే శక్తిని  ఆ  పరమాత్మ  ఇవ్వడం  జరిగింది.   కానీ  మానవుడు  తను  మానసిక  స్థాయి  లోనే (పశు  స్వభావముతో)  ఎక్కువ  కాలము (జన్మలు)  ఉండి  తనకు  తెలిసి తెలియక  మంచి   చెడు   పనులు  అంటే  కర్మలు  చేస్తూ  తన పాప  పుణ్యాల ఖాతా  తెరుచుకొని  జన్మ పరంపర  పెంచుకొంటాడు.    ఆ రకముగా  పరమాత్మకు   దూరమవుతూ  ఉంటాడు.   అంతః  శత్రువులైన కామ, క్రోధాది  అరిషట్ వర్గాలు మానవుని లోబరుచుకొని  అతనిని  అధో మానసిక స్థాయి కి  జేరుస్తాయి.  

No comments:

Post a Comment